‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాకు మంచిపేరు తెచ్చిపెడుతుంది’ అన్నారు కథానాయిక నందితా రాజ్గురు. గాజువాకలో కళానికేతన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
కొత్త సినిమాలున్నాయి..
కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ సినిమా పూర్తవుతుండగానే మరో రెండు సినిమాలకు సంతకం చేశాను. ఆ వివరాలు నేను చెప్పడం బాగుండదు. త్వరలోనే మీకు తెలుస్తాయి.
పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలు ఇష్టం..
గ్లామర్ పాత్రలే కాదు.. పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలను ఇష్టపడతాను. వైవిధ్య భరితంగా ఉన్న పాత్రలన్నీ చేస్తాను.
గ్లామర్ పాత్రలే కాదు.. పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలను ఇష్టపడతాను. వైవిధ్య భరితంగా ఉన్న పాత్రలన్నీ చేస్తాను.
SOCIALIZE IT →